Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వాడిన ద్విచక్ర వాహనాల అమ్మకాల వ్యాపారంలోకి హీరో మోటర్ కార్ప్ అడుగుపెట్టింది. 'హీరో షూర్' పేరుతో దేశ వ్యాప్తంగా దాదాపు 100 షోరూమ్లలో ఈ పథకాన్ని అమలులోకి తెచ్చినట్టుగా సంస్థ తెలిపింది. తమకున్న వాహనాన్ని మంచి ధరతో విక్రయించి మరింత మెరుగైన వాహనాన్ని కొనుగోలు చేయాలనుకొనే వారికి 'హీరో షూర్' మంచి వేదికగా నిలుస్తుందని కంపెనీ తెలిపింది. అదే మాదిరిగా తమ స్థాయి మేరకు వాడిన వాహనాలను మాత్రమే కొనుగోలు చేయగలమని భావించే వారికి నమ్మకమైన వాహన విక్రేతగా 'హీరో షూర్' నిలుస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించనుందని సంస్థ వివరించింది. ప్రయోగాత్మకంగా దీనిని దేశ వ్యాప్తంగా కొన్ని షోరూమ్లలో ప్రారంభించామని.. ఆయా సెంటర్లలో నెలకు సగటున 5000 వాహనాల మార్పిడీ జరిగిందని సంస్థ తెలిపింది.