Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 84వ వ్యవస్థాపక దినోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) బ్యాంక్ జోనల్ మేనేజర్ ఆర్.ఎస్.బన్సాల్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు వివిధ శాఖల నుంచి ఖాతాదారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొత్తపేటలోని వైష్ణవి బ్యాంక్వెట్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకలకు డీఈసీ ఇన్ఫ్రాటెక్ ఎండీ అనిరుధ్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్సాల్ మాట్లాడుతూ బ్యాంక్ అవతరణ దినోత్సవ ప్రాధాన్యతను గురించి వివరించారు. ఖాతాదారుల సౌకర్యార్థం బ్యాంక్ అందిస్తోన్న పలు ఉత్పత్తులను ఆయన ఈ సందర్భంగా వివరించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా ఈ వేడుకల్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ వ్యాపార భాగస్వామ్య సంస్థలైనటువంటి ఎల్ఐసీ, అవైవా లైఫ్, రిలయన్స్ నిప్పో తదితర బీమా కంపెనీలు పాల్గొన్నాయి. వేడుకల్లో పాల్గొన్న బ్యాంక్కు చెందిన పలువురు ఖాతాదారులు మాట్టాడుతూ బీవోఎం అందిస్తున్న సేవలను ప్రస్తుతించారు. ఖాతాదారుల సేవలకు బీవోఎం పెద్దపీట వేస్తోందని వారు వివరించారు.