Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.500లకే విమానయానం సేవలు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా (ఇండియా) ప్రయాణికులను బంఫర్ ఆఫర్ను ప్రకటించింది. దేశంలోని 'సూపర్ సేల్ ' పేరిట పలు మార్గాల్లో రూ.500లకే విమానయానాన్ని అందిస్తు న్నట్టుగా సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం నుంచి ఈ ఆకర్షణీయమైన ఆఫర్ మొదలైనట్టుగా కంపెనీ తెలిపింది. దేశీయంగా 21మార్గాల్లో ప్రత్యేక ఆఫర్ను అందిస్తున్నట్టుగా తెలిపింది. రూ.500, వెయ్యి, పదిహేనువందల రూపాయల మధ్య ఈ వన్ వే టికెట్లను డిస్కౌంట్ రేట్లలో అందిస్తున్నట్టుగా తెలిపింది. ఈ సూపర్ సేల్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 23. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ 17 - మార్చి, 31, 2019 వరకు ప్రయాణం చేసే అవకాశం ఉందని ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఎయిర్ ఏషియా. కాం, ఎయిర్ఏషియా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఈ సూపర్ సేల్ ఆఫర్లో విమాన టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కలిస్తున్నట్టుగా కంపెనీ వెల్లడించింది హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు అమత్సర్, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నరు, గౌహతి, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, కోల్కతా, కొచ్చి, నాగ్పూర్, న్యూఢిల్లీ, పనాజీ, పూణే, రాంచీ , శ్రీనగర్, సూరత్ నగరాల మధ్య ఈ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్టుగా ఎయిర్ ఏషియా తెలిపింది.