Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్కు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీ మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) రాజీవ్ బన్సాల్కు వడ్డీతో సహా రూ.12.17 కోట్లను చెల్లించాల్సిందేనని ట్రిబ్యునల్ ఇన్ఫోసిస్ను ఆదేశించింది. తనకు చెల్లించాల్సిన రూ.17 కోట్ల సెవరెన్స్ ప్యాకేజీ విషయంలో రాజీవ్ బన్సాల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బన్సాల్ ఫిర్యాదుకు వ్యతిరేకంగా కంపెనీ కూడా కౌంటర్ ఫిర్యాదు వేసింది.