Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ముంబయి శివార్లలో 133 ఎకరాల్లో ఉన్న ధీరూభాయి అంబానీ నాలెడ్జ్ సెంటర్(డీఏకెసీ)లో ఐటీ పార్కును అభివృద్ధి చేయనున్నామని ఆ కంపెనీ ఛైర్మన్ అనీల్ అంబానీ తెలిపారు. మంగళవారం ఆర్కామ్ 14 వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ 30 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నామన్నారు. స్థిరాస్తి వ్యాపారంలో అపరిమిత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. టెలికాం వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు అనీల్ తెలిపారు భవిష్యత్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై దృష్టి సారించనున్నామన్నారు. 2000 సంవత్సరంలో టెలికాం సేవలను ప్రారంభించామని ప్రస్తుతం ఈ అప్పులు రూ.40వేల కోట్లకు చేరాయన్నారు. దీంతో ఇక ఈ రంగంలో కొనసాగకూడదని నిర్ణయించామన్నారు. ఈ రంగం దాదాపుగా రూ.7.7 లక్షల కోట్ల అప్పుల భారంలో ఉందన్నారు. ఈ రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ వల్ల గత రెండేళ్లలో దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు పోయాయని అనీల్ పేర్కొన్నారు.