Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14.82 కోట్ల వ్యాపారంతో మార్కెట్లోకి
- మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరణ
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ల విలీనంతో ఏర్పడే కొత్త మెగా బ్యాంకు కార్యకలాపాలు వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచే ప్రారంభమయ్యే అకవాశాలు కనిపిస్తున్నాయి. కొత్త బ్యాంకు కార్యకలాపాలు వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి ప్రారంభం అవుతాయని అనుకుంటున్నాం. ఆలోగా అవసరమైన అన్ని రకాల అనుమతులు పొందడమే కాకుండా, దానికి సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయని భావిస్తున్నామ'ని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నెలలో జరిగే ఆయా బ్యాంకుల బోర్డు సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల ప్రకారం, విలీన ప్రక్రియ విధానాన్ని రూపొందిస్తారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. షేర్ల బదలాయింపు నిష్పత్తి, ప్రభుత్వం నుంచి అందాల్సిన మూలధన సాయం లాంటి వివరాలు ఈ విధానంలో ఉంటాయని తెలిపాయి. బీవోబీ, విజయ బ్యాంక్, దేనా బ్యాంకుల కలయికతో ఏర్పడే కొత్త బ్యాంకు రూ.14.82 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది మూడు బ్యాంకుల విలీనం అనంతరం ఏర్పడే కొత్త బ్యాంకుకు వ్యాపార విస్తరణ ఓ పరీక్ష లాంటిదేనని విశ్లేషకులు చెబుతున్నారు. వ్యాపారాన్ని పెంచుకోవడం, రుణాల వృద్ధిని వేగవంతం చేయడం సవాలుతో కూడుకున్నదేనని ఆర్థిక విశ్లేషణ, రేటింగ్ సంస్థ ఇక్రా ఉపాధ్యక్షుడు కార్తీక్ శ్రీనివాసన్ చెప్పారు.