Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.3.5 లక్షల కోట్ల సంపద ఆవిరి
- రెండు నెలల కనిష్టానికి జారిన సెన్సెక్స్
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ మదుపరులతో కంటతడి పెట్టించాయి. ఇంట్రా ట్రేడింగ్లో రూపాయి విలువ 49 పైసలు పటిష్టమయినప్పటికీ, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాల బాట పట్టాయి. బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్లు తొలుత లాభాల్లోనే మొదలైనప్పటికీ తుదకు నష్టాల్లో ముగిశాయి. ఒడుదొడుకుల నడుమ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 69.45 పాయింట్లు పతనమై 37,121.22 పాయింట్లకు పడిపోయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 37,531 పాయింట్ల గరిష్టానికి చేరినప్పటికీ నిలదొక్కుకోలేక మరో దశలో 37,062.69 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. దీంతో సెన్సెక్స్ రెండు నెలల కనిష్ట స్థాయికి దిగజారినట్టయింది. అ ంతకు ముందు రెండు సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లను కోల్పోయింది. విదేశీ మదుపర్ల ఈక్విటీల తరలింపు కొనసాగింది. మూడు రోజుల వరుస నష్టాలతో మదుపర్లు రూ.3.62 లక్షల కోట్లు నష్టపోయారు. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 44.55 పాయింట్లు నష్టపోయి 11,234.35 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా ట్రేడింగ్లో నిఫ్టీ 11,332-11,210.90 మధ్య కదలాడింది.