Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు తరలిపోయిన లక్కర్ డాన్ విజరు మాల్యా నుంచి డబ్బుల రికవరీకి దర్యాప్తు సంస్థలు ఆయన ఆస్తుల ను జప్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా బెంగళూ రులోని డెబిట్ రికవరీ ట్రైబ్యూనల్ (డీఆర్టీ-2) బ్యాంకుల కన్సార్టియం తరఫున మాల్యాకు చెందిన రెండు వ్యక్తిగత చాపర్లను ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ద్వారా వేలం వేసింది. డీఆర్టీ నిర్వహించిన ఇ-వేలంలో మాల్యాకు చెందిన రెండు హెలికాప్టర్లను కొనుగోలు చేసినట్లు చౌదరి ఏవియేషన్ ఫెసిలిటీ లిమిటెడ్ మీడియాకు తెలిపింది. ఒక్కోటి రూ.4.37 కోట్ల చొప్పున రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఒక్కోటి రూ. 1.75కోట్ల కనీస ధరతో ఈ బిడ్డింగ్ను ప్రారంభించగా.. రూ. 4.37కోట్లకు చౌదరి ఏవియేషన్ ఫెసిలిటీ సొంతం చేసుకుంది. '5 సీట్లు ఉండే ఈ ఎయిర్ బస్ యూరోకాప్టర్ బీ155 చాపర్లు పదేళ్ల పాతవి. అయినప్పటికీ ఇప్పటికీ సర్వీస్లోనే ఉన్నాయి. చాపర్ ఇంజిన్లు బాగా పనిచేస్తున్నాయి.