Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 మేటి రాష్ట్రాల్లో ఒకటి: అమెజాన్
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం:
తెలంగాణలో అత్యధికులు అమోజన్ ద్వారా స్మార్ట్ఫోన్ల కొను గోలు జరుపుతున్నట్టుగా అమెజాన్ ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ స్మార్ట్ఫోన్స్ కేటగిరీ లీడర్ నిశాంత్ సార్ధన తెలిపారు. దేశంలో అత్యధికంగా స్మార్ట్ఫోన్స్ను విక్రయిం చే మేటి 10 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ఏడాది ప్రాతి పదికన ఈ రాష్ట్రంలో స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో 50% వృద్ధి కనిపిస్తోందని ఆయన అన్నారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతేడాది పండుగ సీజన్ అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది 1.5-2 రెట్ల మేర అమ్మకాలు పెరుగొచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.తమ పోర్టల్లో 2500 రకాల ఫోన్లను అందుబాటులో ఉంచామన్నారు. ఇందులో 250 మోడళ్లు ప్రత్యేకంగా తమ పోర్టల్లో మాత్రమే లభిస్తాయన్నారు. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డుపైనే నెలసరి వాయిదా చెల్లింపు (ఈఎంఐ) పద్ధతిన విక్రయాలు జరిపామని, తాజాగా డెబిట్ కార్డుపై కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. అర్హత కలిగిన వినియోగదారులకు డెబిట్ కార్డుపై రూ.60,000 విలువ చేసే వస్తువులను కొనుగోలు చేయొచ్చన్నారు.