Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం శాంసంగ్ అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్ను మార్కెట్లో కి విడుదల చేసింది. గెలాక్సీ-ఎ7 2018 పేరుతో దీనిని మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ రూ.29,385 ధరతో త్వరలో వినియోగదారులకు అందు బాటులోకి రాన్నునట్టుగా సమాచారం. మార్కెట్లో ఎదు రవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని పలు ఆకట్టుకునే ఫీచర్లతో శాంసంగ్ దీనిని రూపొందించింది. శాంసంగ్ గెలాక్సీ-ఎ7 2018 స్మార్ట్ఫోన్ వెనుక భాగంలో 24, 8, 5 మెగా పిక్సల్ సామర్థ్యంతో కూడిన ట్రిపుల్ కెమేరాలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమేరాలను అమర్చారు.
మొత్తం కెమెరాలన్నీ ఏఐ టెక్నాలజీతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలను అందిస్తాయని కంపెనీ తెలిపింది. కొత్త స్మార్ట్ ఫోన్ ఆరు అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1080- 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, వేగంగా చార్జింగ్ వంటివి ఈ ఫోన్లో అదనపు ఫీచర్లు.