Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలబార్ గ్రూపు చైర్మెన్ అహమ్మద్ ఎంపీ వెల్లడి
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రానున్న ఐదేండ్ల కాలంలో మార్కెట్లో విస్తృతంగా విస్తరించాలని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న సంస్థ 250 షోరూమ్ల సంఖ్యను 750కి విస్తరించాలని భావిస్తున్నట్టుగా మలబార్ గ్రూపు చైర్మెన్ అహమ్మద్ ఎంపీ తెలిపారు. ఇందుకుగాను దాదాపు రూ.7000 కోట్ల వరకు వెచ్చించనున్నట్టుగా ఆయన తెలిపారు. విస్తరణ ద్వారా 2023 నాటికి సంస్థ టర్నోవర్ను రూ.50,000 కోట్లకు చేర్చాలని తాము ఆశిస్తున్నట్టుగా ఆయన వివరించారు. మలబార్ సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వ్యాప్తిని ప్రస్తుతం ఉన్న తొమ్మిది దేశాల నుంచి మరిన్ని విదేశీ మార్కెట్లకు కూడా విస్తరించాలని భావిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ప్రస్తుతం మలబార్ గ్రూపు భారత్, మధ్య ప్రాచ్యం, దక్షిణాసియా, అమెరికాల్లో తమ షోరూమ్లను కలిగి ఉంది. సంస్థ విస్తరణలో భాగంగా రానున్న రోజుల్లో అన్ని ప్రథమ శ్రేణి నగరాలతో పాటు ఉత్తరాది, మధ్య భారతంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాలని సంస్థ నిర్ణయించిందని అహమ్మద్ వివరించారు. గత 25 సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధికి ఊతం ఇచ్చిన వినియోగదారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
అత్యాధునికంగా దిల్సుఖ్నగర్ షోరూమ్..
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ దిల్సుఖ్నగర్లోని తమ షోరూమ్ను ఆధునికరించి బుధవారం పున:ప్రారంభించింది. మా ఈఎన్టీ హస్పిటల్ ఎండీ సునీత జి కుమార్ చేతుల మీదుగా మలబార్ రీజినల్ హెడ్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎన్.సి.ఆర్, పశ్చిమ బెంగాల్) సిరాజ్ పి.కె. ఈ కొత్త షోరూమ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజ్మెంట్ అండ్ టీమ్ వినియోగదారులు శ్రేయో భిలాషులు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా దిల్సు ఖ్నగర్లో అభ రణాల ప్రియులకు సేవ లందిస్తోందన్నారు. ఆధుని కరించిన షోరూమ్ ద్వారా మరింత మెరగైన వాతావరణంలో బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి ఆభరణాలు తాజా మరియు విస్తృతమైన కలెక్షన్లలో అందిచేందుకు వీలుపడుతుందని తెలిపారు.