Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో సచిన్ బన్సల్ క్యాబ్ సేవలను అందించే ఓలా సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఫ్లిప్కార్ట్లో 5.5శాతం వాటాను వాల్మార్ట్కు విక్రయించిన అనంతరం సచిన్.. బహుముఖ విస్తరణలో భాగంగా ఓలాలో 100 మిలియన్ డాలర్లను (రూ.740కోట్ల నిధులను) ఇన్వెస్ట్ చేయనున్నట్టుగా సమచారం. దీంతో ఓలాలో భారత్ నుంచి అతిపెద్ద పెట్టుబడులకు తెర లేచినట్టయింది.