Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చేనేత ద్వారా విభిన్న రకాల వస్త్రాల తయారీలో భారత్కు విశిష్ట స్థానం ఉందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కంకటాలా వస్త్రాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్రావు సంస్థ చైర్మెన్ మల్లిక్ కంకటాలా, అనిరుధ్ కంకటాలాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మల్లిక్ దేశంలోనే అతి ఖరీదైన చీరగా చెబుతోన్న పఠాన్ పటోలాస్, పైథానీస్, కంజీవరం, బెనారస్తో పాటు ఖాదీ చీరలను ప్రదర్శించారు. పఠాన్ పటోలాస్కు చెందిన రూ.12.5 లక్షల విలువైన చీర అతిథులను ఆశ్చర్యపరిచింది. దాదాపు రెండున్నరేండ్ల పాటు శ్రమించి ముగ్గురు నేత వారు ఈ చీరలను తయారు చేసినట్టు ఆయన తెలిపారు. ఇసామాన్యులకు అందుబాటులో ఉండే ధరలతో పాటు గరిష్టంగా రూ.12.5 లక్షలు విలువ చేసే చీరలను తాము షోరూమ్లో అందుబాటులో ఉంచినట్టుగా నిర్వాహకులు తెలిపారు.