Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాణిజ్య విభాగం:
మలేషియాకు చెందిన టైౖటానియం వరల్డ్ టెక్నాలజీ (టీడబ్ల్యూటీ) భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన అనుబంధ సంస్థ స్మార్ట్ కోట్ ఇండియా లిమిటెడ్ ద్వారా హైదరాబాద్ కేంద్రంగా కార్యక లాపాలు నిర్వహిం చనున్నట్లు టీడ బ్ల్యూటీ ఎస్డీఎస్, బీహెచ్డీ టెక్నికల్ డైరెక్టర్ హెంగ్ తెలిపారు.గురువారం హైదరాబాద్లో పారిశ్రామిక వినియో గం కోసం స్మార్ట్ కోట్ నానో, వ్యక్తిగత వినియోగం కోసం అర్మోర్8ను అనే రెండు యాంటీ-మైక్రోబియాల్ ఉత్పత్తులను సంస్థ మార్కెట్లోకి విడుదలచేసింది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవి బాక్టీరియా, వైరస్ల నుండి స్వీయ రక్షణగా పనిచేయడమే కాకుండా ఇబ్బందికరమైన దుర్వాసనలను ఈ ఉత్పత్తులు నిరోధిస్తాయని తెలిపారు. అర్మోర్8 అనేది విప్లవాత్మకమైన దీర్ఘ కాలం మన్నే క్రిమిరహితం చేసే ఒక నానోపార్టికల్ స్ప్రే అన్నారు. వచ్చే నెల రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్ప త్తులను అందుబాటులోకి తెస్తామని స్మార్ట్కోర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ సింగ్ తెలిపారు.