Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23 శాతం మేర పెరిగిన సంస్థ లాభం..
- రూ.4 తాత్కాలిక డివిడెండ్ ప్రకటన
- సంస్థలో కొత్తగా 10,227 కొలువులు
ముంబయి: దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో త్రైమాసికానికి అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. రూపాయి విలువ పతనమవుతూ డాలరు విలువ అంతకంతకు బలపడడం టీసీఎస్ సంస్థకు బాగా కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో జులై-సెప్టెంబరు మధ్య కాలానికి ఏడాది ప్రాతిపదికన సంస్థ లాభాలు 23 శాతం మేర ఎగిసి రూ.రూ.7,901 కోట్లగా నమోదైనట్టుగా టీసీఎస్ తెలిపింది. ముంబయి ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ, గతేడాది రెండో త్రైమాసిక కాలంలో రూ.6,646 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. రెండో త్రైమాసికంలో సంస్థ రెవెన్యూలు రూ.36,854 కోట్లగా నమోదు అయింది. గతేడాది ఇవి రూ.30,541 కోట్లగా ఉన్నాయి. ఫలితాల ప్రకటనలో భాగంగా మదుప రులకు టీసీఎస్ సంస్థ బొనాంజాను ప్రకటించింది. ఒక్కో షేరుపై రూ.4 తాత్కాలిక డివిడెండ్ను జారీ చేయనున్నట్టుగా ప్రకటించింది. టీసీఎస్. కంపెనీ సభ్యులుగా రిజిస్టర్లో నమోదైన షేర్ హౌల్డర్స్కు లేదా షేర్ల లాభదా యక ఓనర్లుగా ఉన్న వారికి ఈ డివిడెండ్ను ఇవ్వనున్నట్టు తెలిపింది. రెండో త్రైమాసికపు కాలంలో నికరంగా సంస్థలోకి కొత్తగా 10,227 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్టు టీసీఎస్ ప్రకటించింది. గడిచిన 12 క్వార్టర్లలో ఇదే అత్యధికమని తెలిసింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,11,102 కు పెరిగినట్టుగా సంస్థ తెలిపింది. తమ కంపెనీ మహిళా ఉద్యోగులు 35.7 శాతంగా ఉన్నట్టు టీసీఎస్ వెల్లడించింది.