Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: కొత్త ట్రేడింగ్ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. శుక్రవారం నాటిమయ లాభాలకు కొనసా గింపుగా సోమవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభ మైన మార్కెట్లు తర్వాత లాభ నష్టాలతో ఒడిదొడుకులకు గురయ్యాయి. ఎట్టకేలకు చివరకు లాభాలను ఆర్జించాయి. ఐటీ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు కలిసొచ్చాయి. ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లు ఒత్తిడి కి గురయ్యాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్ స్వల్ప నష్టంతో 34,729 పాయిం ట్ల వద్ద ట్రేడింగ్ ఆరంభించగా, నిఫ్టీ 10,460 పాయింట్ల పైన ట్రేడింగ్ ప్రారం భించింది. ముగింపులో సెన్సెక్స్ 131.52 పాయింట్ల లాభంతో 34,865.10 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 40పాయింట్ల లాభంతో 10512.50 పాయింట్లకు చేరింది. ఎన్ఎస్ఈలో డా.రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ఇన్ఫోసిస్, ఐటీసీ, బీపీసీఎల్ తదితర కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్ యూఎల్, హెచ్పీసీఎల్, ఎం అండ్ ఎం, గెయిల్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.02 వద్ద ట్రేడయింది.