Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి మార్కెట్లను మురిపించే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ మార్కెట్ అంచనాలను మించి రూ.4,110 కోట్ల లాభాన్ని ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో ప్రకటించిన రూ.3,600 కోట్ల కంటే ఇది అధికం. దీంతో రెండో త్రైమాసిక ఫలితాల్లో వార్షిక ప్రాతిపదికన కంపెనీ లాభాల్లో 10.3శాతం వృద్ధిని నమోదు చేసినట్టయింది. ఈ ఏడాది ఆర్థిక వ ద్ధి 6-8శాతం వుండొచ్చని ఇన్ఫోసిస్ వెల్లడించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ మొత్తం 17.30 శాతం వృద్ధితో రూ.20,609 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. దీంతో ఇన్ఫోసిస్ ఇటీవలి కాలంలో క్రమం తప్పకుండా 6-8శాతం వృద్ధిని నమోదు చేసినట్టయింది. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ సంస్థ సీఈవో సలీల్ పరేఖ్ మాట్లాడుతూ రెండో త్రైమాసిక కాలంలో తమ సంస్థ వివిధ దేశాల్లోని అన్ని వ్యాపారాల్లో వృద్ధిని నమోదు చేసినట్టుగా తెలిపారు. ఇది చాలా సంతోషదాయకమని ఆయన అన్నారు. వినియోగదారులతో తమకున్న బలమైన అనుబంధానికి ఇది నిదర్శనం అన్నారు. డిజిటల్ విభాగం తమ సంస్థ పూర్తి స్థాయిలో సేవలు అందిస్తోందని..వినియోగదారుల అవసరాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టుగా వివరించారు. సెప్టెంబరు త్రైమాసికంలో కొత్తగా 2 బిలియన్ డాలర్లు విలువైన ఆర్డర్లను సొంతం చేసుకున్నట్టుగా ఆయన తెలిపారు. ఫలితాల వెల్లడిలో భాగంగా సంస్థ ప్రతీ ఈక్విటీ షేరుకు 7రూపాయల చొప్పున మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. అక్టోబరు 30 తరువాత డివిడెండ్ చెల్లిస్తారు.