Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ అనుకూలతల నేప థ్యంలో భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లో కదలా డాయి. ముడి చమురు ధరలు కాస్త శాంతిం చడం, రూపాయి పుంజుకోవడంతో పాటు కీలక స్టాక్స్ లాభాల్లో నడయాడడం మార్కెట్లకు కొత్త జోష్ను ఇచ్చాయి. కొనుగోళ్ల అండతో సోమవారం లాభాలలో నిలిచిన మార్కెట్లు మంగళవారం కూడా ఉత్సాహంగా ముందుకు సాగాయి. అంతర్జాతీయంగా మిశ్రమ స్పందనలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలపై పెద్దగా ప్రభావం పడలేదు. సానుకూల వాతావారణం నేపథ్యంలో ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే జోరు కొనసాగించాయి. సెన్సెక్స్ ఉదయం వంద పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కాగా.. నిఫ్టీ 10,550 పాయింట్ల పైన ట్రేడింగ్ ఆరంభించింది. ఆద్యంతం లాభాలలో నడిచిన మార్కెట్లు చివరి వరకు ఆదే జోష్తో ముందుకు నడిచాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 297.38 పాయింట్ల లాభంతో 35162.48 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 72.25 పాయింట్ల లాభంతో 10584.75 పాయింట్లు కుంగింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.72వద్ద కొనసాగింది. ఎన్ఎస్ఈలో ఎం అండ్ ఎం, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీలు లాభపడ్డాయి. ఇండియా బుల్స్ హౌసింగ్, ఐషర్ మోటార్స్, సిప్లా, భారతి ఇన్ఫ్రాటెల్, జేఎస్డబ్ల్యు స్టీల్ తదితర కంపెనీల స్టాక్స్ నష్టపోయాయి.