Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7నుంచి 8% వాటా కొనుగోలుకు ఆసక్తి
- రూ.2500 కోట్లకు దరిదాపుల్లో డీల్!
- రెండు వారాల్లో ఒప్పందంపై సంతకాలు
- వాల్మార్ట్కు దీటుగా ఎదిగేందకు ప్లాన్
- కలకలం రేపిన ఆంగ్ల మీడియా కథనం
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ భారత్లో తన విస్తృతిని గణనీయంగా పెంచుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఆ సంస్థ ఇప్పటికే పలు రిటైల్ మార్కెట్ చైన్స్ను కొనుగోలు చేస్తూ తన వ్యాప్తిని పెంచుకుంటోంది. ఇటీవలే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన 'మోర్' రిటైల్ చైన్ను సొంతం చేసుకున్న సంస్థ.. తాజాగా కిశోర్ బియానీ సంస్థ అయిన ఇండియాస్ ఫూచర్ రిటైల్ సంస్థలో 7 నుంచి 8 శాతం వాటాను కొనుగోలు చేయను న్నట్టుగా సమాచారం. ఈ వాటా కొనుగోలు వ్యవహారంతో దగ్గర సంబంధం కలిగి వ్యక్తులను ఉటంకిస్తూ సీఎన్బీసీ-టీవీ18 చానెళ్ ఈ విషయాన్ని వెల్లడించింది. క్యాష్- అండ్-స్టాక్ ఈ డీల్ జరుగనుంది. దాదాపు రూ.2500 కోట్లకు ఈ వాటా విక్రయించే దిశగా ఈ చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. చర్చలు కొలిక్కి రాగానే రెండు వారాల్లో వాటా విక్రయానికి సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరగనుందని సమాచారం. ఈ ఏడాది తొలినాళ్లలో కూడా అమెజాన్ సంస్థ ఫ్యూచర్ రిటైల్లో 10 శాతం వాటా కొనుగోలుకు గాను గూగుల్, అలీబాబా దన్నుగా నడుస్తున్న పేటీఎం సంస్థలు ప్రయత్ని స్తున్నట్టగా వార్తలు వచ్చాయి. కానీ వీటిని అప్పట్లో ఫ్యూచర్ సంస్థ తోసిపుచ్చింది. వాల్మార్ట్ సంస్థ ఫ్లిప్కార్ట్లో కీలక వాటాను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ సంస్థకు దీటుగా ఎదిగేందుకు గాను అమెజాన్ సంస్థ రిటైల్ చైన్స్ను తన ఖాతాలో వేసుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఫ్యూచర్పై దృష్టి పెట్టినట్టుగా మార్కెట్ వర్గాలు చెబుతు న్నాయి. అయితే ఈ వార్తలను ఇరు సంస్థల ప్రతినిధులు వెంటనే ధ్రువీకరించేందుకు నిరాకరించారు.
రివ్యున ఎగిసిన స్టాక్స్..
అమెజాన్.కామ్ సంస్థ ఫ్యూచర్ గ్రూపులో మైనార్టీ వాటాను కొనుగోలు చేయనుందన్న వార్తల నేపథ్యంలో గ్రూపునకు చెందిన సంస్థల షేర్లు మంగళవారం ఒక్కసా రిగా ఎగిశాయి. ప్యూచర్ రిటైల్ స్టాక్ 19% మేర పెరిగి దాదాపు రూ.518ల స్థాయికి చేరింది. ఈ సంస్థ స్టాక్ విక్రయాల్లో ఆరింత మేర వృద్ధి కనిపించింది. ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ విలువ 15% పెరిగి రూ.43కు చేరింది. ఫ్యూచర్ కన్జూమర్ స్టాక్ 12% మేర ఎగిసి రూ.45.25 స్థాయికి చేరకుంది, ఫ్యూచర్ సప్లయి చైన్ స్టాక్ 7 శాతం, ఫ్చూర్ మార్కెట్ నెట్వర్క్ 12 శాతం పెరిగి రూ.76.80లకు పెరిగింది.