Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో త్రైమాసిక ప్రాఫిట్ 9516 కోట్లు
- రోజువారీ సగటు లాభం 103 కోట్లకు చేరిక
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థ రిలయన్స్ సెప్టెంబరుతో ముగి సిన రెండో త్రైమాసికంలో రికార్డు ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరు మధ్య కాలంలో ఏడాది ప్రాతిపదికన సంస్థ లాభం దాదాపు 17.35 శాతం మేర పెరిగి రూ.9,516 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ చరిత్రలో సంస్థ ఒక త్రైమాసికానికి ఇంత భారీ లాభాలను ప్రకటించడం ఇదే తొలిసారి. గత ఏడాది ఇదే కాలంలో రిలయన్స్ సంస్థ రూ.8,109 కోట్ల లాభాన్ని ప్రకటించింది. జులై-సెప్టెంబరు మధ్య కాలంలో సంస్థ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 54.5 శాతం మేర పెరిగి రూ.1,56,291 కోట్లుగా నమోదు అయింది. పెట్రోకెమికల్, చమురు శుద్ధి ఉత్పత్తులను నుంచి ఆదాయం పెరగడం, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 44.5 శాతం మేర పెరగడం కూడా సంస్థకు సెప్టెంబరు త్రైమాసికంలో బాగా లాభించింది. కొత్త పెట్రోకెమికల్ ఫెసిలిటీ అందుబాటులోకి రావడం కూడా సంస్థ ఆదాయం పెరగడానికి బాగా దోహదం చేసింది. ఒక్కో పిపా చమురు శుద్ధిపై సంస్థ 9.50 డాలర్ల మార్జిన్ను నమోదు చేసింది.