Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న ఇంజినీరింగ్ డిజైన్ సర్వీస్, ఐటీ సేవల సంస్థ సైయంట్ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మార్కెట్లను మెప్పించే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర లాభం 14 శాతం మేర పెరిగి రూ.127 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.109.7 కోట్లుగా నమోదు అయింది. జులై-సెప్టెంబరు మధ్య కాలానికి సంస్థ ఆదాయం కూడా 23.6 శాతం మేర పెరిగి రూ.1000.60 కోట్ల నుంచి రూ.1243.80 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో సంస్థ నికర అమ్మకాలు 22.94 శాతం వృద్ధితో రూ.965.40 కోట్ల నుంచి రూ.1,186 కోట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. బుధవారం సమావేశమైన సంస్థ బోర్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5ల ముఖ విలువ కలిగిన షేరు ఒక్కింటికి రూ.6ల మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. అక్టోబరు 31ని ఇందుకు రికార్డు డేట్గా పరిగణించనున్నట్టుగా కంపెనీ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సంస్థ స్టాక్ రూ.669.85 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ స్టాక్ రూ.689-665 మధ్య కదలాడింది.