Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: పండుగ సీజన్ నేప థ్యంలో రిలయన్స్ జియో సంస్థ ప్రత్యేకమైన పండుగ ఆఫర్ను ప్రకటించింది. పండుగల సీజన్ సందర్భంగా జియో సంస్థ 'స్పెషల్ యాన్యువల్ ప్లాన్'ను తీసుకొచ్చింది. ఆ ఆఫర్ కింద రూ.1699తో రీఛార్జ్ చేయించుకుంటే వచ్చే ఏడాది దివాళి వరకు కస్టమర్లు ఉచితంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని ప్రకటించింది. ఈ ప్లాన్ కింద ఉచితంగా లోకల్, నేషనల్ కాల్స్, అపరిమిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 547.5 జీబీ డేటాను పొందవచ్చని కంపెనీ తెలిపింది. అంటే రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. వచ్చే ఏడాది దివాళి వరకు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు జియో ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫర్ లైవ్లో భాగంగా ప్రకటించింది. అంతేకాక రూ.100 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని ప్లాన్లపై కూడా 100 శాతం క్యాష్బ్యాక్ను ఇవ్వనుంది. రూ.1699 రూపాయల యాన్యువల్ ప్లాన్పై కూడా 100 శాతం క్యాష్బ్యాక్ పొందాలంటే 2018 నవంబర్ 30 వరకు ఈ స్కీమ్ను పొందాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఓచర్లు 2018 డిసెంబర్ 31కు ముగిసిపోతాయి.