Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయంగా విదేశీ మారకపు నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. గత వారం ఈ నిల్వలు 5.1 బిలియన్ డాలర్లు (రూ.37,472కోట్లు) మేర తరిగిపోయాయి.ఆర్బీఐ గణాంకాల ప్రకారం, మనదగ్గరున్న మొత్తం విదేశీ మారక నిల్వలు 399.6 బిలియన్ డాలర్ల (1 బి.డాలరు రూ.7347కోట్లకు సమానం) నుంచి 394.46 బిలియన్ డాలర్లకు (అక్టోబరు 12నాటికి) పడిపోయాయి. విదేశీ మారక నిల్వల్లో ఇది ఈ ఏడాదిలోనే కనిష్టస్థాయి. అంతేగాక ఒక్కవారంలో 5.1 బిలియన్ డాలర్లు తరిగిపోవటం 7 ఏండ్లలో ఇదే అత్యధికం. 2018 మార్చి తర్వాత మొత్తం 30 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడుదారులు తమ పెట్టుబడుల్ని స్టాక్మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవటం వల్లే నిల్వలు పడిపోవడానికి దారితీసిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతనెల రోజులుగా రూపాయి పతనం కొనసాగుతోంది. శుక్రవారంనాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.32కు చేరుకుంది. ఈ ఏడాది రూపాయి విలువ 12శాతం కోల్పోయిందని, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో, ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధుల వ్యయం జరుపుతుందన్న ఊహాగానాలు రూపాయి విలువను బలహీనపర్చిందని వారు అభిప్రాయపడ్డారు.