Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని గృహోపకర ణాలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ దిగ్గజం హేయర్ ఇండియా, భారత మార్కెట్లోకి కొత్త తరహా రిఫ్రిజిరేటర్లను, వాషింగ్ మెషిన్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రిఫ్రిజిరేటర్ల కన్నా విభిన్నంగా చక్కని రూపంతో పాటు గ్లాస్ ఫినిష్తో తయారు చేసిన అత్యాధునిక రిఫ్రిజిరేటర్లను బాటమ్ మౌంటెడ్, టాప్ మౌంటెడ్, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లను సంస్థ రూపొందించింది. డైరెక్ట్ కూలింగ్ రిఫ్రిజిరేటర్ల ధరలు రూ.21,000 నుంచి మొదలుకొని రూ.23,700, బాటమ్ మౌంటెడ్ రిఫ్రిజిరేటర్ల ధరలు రూ.36,300 నుంచి రూ.49,900 వరకు, టాప్ మౌంటెడ్ రిఫ్రిజిరేటర్ల ధరలను రూ.34,500 నుంచి రూ.37,000 వరకు నిర్ణయించినట్టుగా కంపెనీ తెలిపింది. పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని హేయర్ సంస్థ మార్కెట్లోకి సముద్రపు అలల టెక్నాలజీతో కూడిన సరికొత్త టాప్ లోడర్ వాషింగ్ మెషిన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 8.5 కిలోల సామర్థ్యంతో కూడిన ఈ కొత్త వాషింగ్ మెషిన్ను సంస్థ హెచ్డబ్ల్యుఎంఎస్ఎఫ్ -జీఎన్డీపీ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. దీని ధరను కంపెనీ రూ.34,750గా కంపెనీ నిర్ణయించింది.