Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లోకి 'డెస్టినీ-125'
- ధర రూ.54,650
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ (హెచ్ఎంసీ) సంస్థ భారత మార్కెట్లోకి సరికొత్త స్కూటర్ను అందుబాటులోకి తెచ్చింది. 125 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన స్కూటర్ల విభాగంలోకి తొలిసారిగా అడుగు పెడుతూ సంస్థ 'హీరో డెస్టినీ-125' వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ.54,650గా (ఎక్స్షోరూమ్, న్యూఢిల్లీ) నిర్ణయించింది. ఎల్ఎక్స్, వీక్స్ వేరియంట్లలో సంస్థ ఈ కొత్త స్కూటర్ను నాలుగు రంగుల్లో అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ కొత్త స్కూటర్ను 125సీసీ సామర్థ్యం, 8.7 బీహెచ్పీ, 10.2 టార్క్తో కూడిన సింగిల్ సిలిండర్ ఇంజిన్తో దీనిని రూపొందించింది. దీనికి తోడు మేటి భద్రత నిమిత్తం ఈ స్కూటర్ను ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (ఐబీఎస్), బయటవైపే పెట్రోల్ పాయింట్, బూట్ లైట్, అనలాగ్-డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్, సర్వీస్ రిమైండర్, మొబైల్ చార్జింగ్, స్టాండ్ ఇండికేటర్ సౌలభ్యా లతో దీనిని హీరో సంస్థ రూపొందించింది. డెస్టినీ-125 వీఎక్స్ వేరియెం ట్ ధరను కంపెనీ రూ.57,500గా (ఎక్స్షోరూమ్, న్యూఢిల్లీ) ప్రకటిం చింది. వచ్చే కొద్ది వారాల్లోనే ఇతర ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నామని హీరో మోటో కార్ప్ లిమిటెడ్ గ్లోబల్ ప్రొడక్టు ప్లానింగ్ హెడ్ మాలో లి మాసన్ తెలిపారు. డెస్టినీ దేశంలోనే తొలి 'ఐ3ఎస్-ఐడిల్ స్టార్ట్-స్టాప్' సిస్టమ్ను కలిగి ఉన్న స్కూటర్ అని అన్నారు. 125 సీసీ కేటగిరిలో డెస్టినీ తమ అమ్మకాలను భారీ మద్దతును ఇవ్వనుందని హీరో మోటో కార్ప్ కస్టమర్ కేర్ సేల్స్ హెడ్ సంజరు భాను తెలిపారు.