Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భార త్లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు అంత కంత కు పెరుగుతున్నాయి. సెప్టెంబరు త్రైమాసి కంలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు దాదాపు 5 శాతం వృద్ధి చెంది జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీనికి సంబంధించిన నివేదికను కౌంటర్ పాయింట్ రిసెర్చ్ తాజాగా వెల్లడించింది. జులై- సెప్టెంబరు త్రైమాసికంలో దేశీయంగా దాదాపు 4.4 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జరిగాయి. అంటే సగటున నెలకు కోటిన్నర స్మార్ట్ఫోన్ల విక్రయాలు జరిగాయన్నట్టు. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కేవలం ఐదు బ్రాండ్లే అత్యధికంగా అమ్ముడుపోయాయనినివేదిక తెలిపింది. దాదాపు 77% మార్కెట్ వాటాను ఇవే సొంతం చేసుకున్నట్టుగా తెలిపింది. అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్లలో తొలి స్థానంలో చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజ సంస్థ షామీ నిలవగా.. తర్వాతి స్థానంలో దక్షిణకొరియా సంస్థ శాంసంగ్ సొంతం చేసుకుంది. మొత్తం అమ్మకాలలో షామీ 27 శాతం మార్కెట్ షేర్ను కలిగి ఉండగా, శాంసంగ్ 23%, వివో 10%, మైక్రోమాక్స్ 9%, ఒప్పో 8% వాటాలను పొందాయి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తొలి ఐదు బ్రాండ్స్లో మైక్రోమాక్స్ చోటు దక్కించుకోవడం విశేషం. శాంసంగ్ నుంచి విడుదలైన జే సిరీస్ స్మార్ట్ఫోన్లు జే6, జే8కి మంచి డిమాండ్ లభించిందని నివేదిక తెలిపింది. అమ్మకాలలో వివో 11, వివో 11 ప్రొ స్మార్ట్ఫోన్ల విక్రయాలు అధిక వాటాను పొందాయి.