Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: విని యోగదారులు ఎంత గానో ఎదురుచూస్తున్న హ్యుందారు శాంత్రో కారు మార్కెట్లోకి వచ్చేసింది. సంస్థ తమ ప్రముఖ చిన్న కారు(హ్యాచ్బ్యాక్) శాం త్రోను ఆధునికరించి మంగళవారం భారత విపణిలోకి ప్రవేశపెట్టింది. హ్యుందారు బ్రాండ్ అంబాసిడర్ షారుఖ్ ఖాన్తో పాటు కంపెనీ ప్రతినిధులు ఈ కారును మార్కెట్లోకి విడుదల చేశారు. కారు ప్రారంభ ధరను కంపెనీ రూ.3.89లక్షలుగా (ఎక్స్షోరూమ్, న్యూఢిల్లీ) ప్రకటించింది. ఆస్టా వేరియంట్ ధరను కంపెనీ రూ.5.45లక్షలుగా (ఎక్స్షోరూమ్, న్యూఢిల్లీ)వెల్లడించింది. ఈనెల 10వ తేదీ నుంచి ఆన్లైన్లో శాంట్రో కారు బుకింగ్స్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేవలం పన్నెండు రోజుల్లోనే దాదాపు 14 వేలకు పైగా బుకింగ్స్ జరిగాయని కంపెనీ తెలిపింది. కొత్త శాంత్రోలో 4-సిలిండర్ 1.1లీటర్ పెట్రోల్ ఇంజిన్ను అమర్చారు. ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్(ఏఎంటీ), ఫ్యాక్టరీలో అమర్చిన సీఎంజీ ఫ్యూయల్ వేరియంట్లలో ఈ కారు లభించనుంది. ఈ సెగ్మెంట్లో తొలిసారిగా వెనుక సీట్లకు కూడా ఏసీ సౌకర్యాన్ని కల్పించారు. కొత్త శాంత్రోలోని స్పోర్ట్స్, ఆస్టా రకాల్లో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్తో అందుబాటులోకి తెచ్చారు. దీనికి బ్లూటూత్, నేవిగేషన్ వంటివి అనుసంధానం చేసుకొనే వీలుండడం విశేషం.