Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానున్న ఎన్నికల నేపథ్యంలో దేశంలో కరెంటు ఖాతా లోటు అంతకంతకు పెరిగిపోతోంది. ఎన్నికలకు కేవలం స్వల్పకాలం మాత్రమే గడువుండడంతో ఆర్బీఐ వద్ద రిజర్వుగా ఉన్న నిధులను ఖజానాకు మళ్లించి ప్రజా కర్షక పథకాలతో ఓట్లను దండుకోవాలని ప్రభుత్వం భావి స్తోంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సర్కారు ఆర్ బీఐ ఉన్నత కార్యవరంపై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ గవర్నర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రతిపాదనకు నో చెబుతున్నారు. ఈ నేపథ్య ంలోనే ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య వివాదం ముదిరి పాకాన పడిన సంగతి తెలిసిందే. అయితే రానున్న ఎన్నిక లకు ముందు, అందునా ఆర్థిక సేవల రంగం వివిధ కుంభకోణాలతో సతమతమవుతున్న తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఉన్నతాధికారులిద్దరు రాజీనామా చేయడం ప్రభు త్వానికి భారీ ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కానీ ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయవలసి వస్తే మాత్రం అది ఆర్ధిక వ్యవస్థకు ముప్పేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారు ఉర్జిత్ను ఆరోగ్య కారణాలు చూపి తప్పించేలా స్కెచ్ వేస్తోందన్న ఆరోపణలు వినవస్తు న్నాయి. ఇప్పుటు అనారోగ్య సమస్యలు అనేవి ప్రభుత్వ స్క్రిప్ట్లో భాగమేనని.. ఉర్జిత్ను హుందాగా తప్పించేలా ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ అనే విమర్శలు లేకపోలేదు.