Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీపావళి వేళ మార్కెట్లకు లాభాలు
- 35 వేల పాయింట్లపైకి సెన్సెక్స్
- 68 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
- గురువారం పని చేయనిమార్కెట్లు
- నేటి నుంచి ట్రేడింగ్ తిరిగి షురూ
ముంబయి: 'సంవత్-2075' దేశీయ స్టాక్ మార్కెట్లు సంతోషంగా ప్రారంభించాయి. దీపావళి పర్వదినాన కొత్త సంవత్సరాది సంవత్ ప్రారంభాన్ని పురస్కరించుకొని దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రత్యేక ట్రేడింగ్ను నిర్వహించారు. బుధవారం సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు కేవలం గంటపాటు నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్ మదుపరులకు లాభాలను పంచింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ టంతో సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ సాధించగా, నిఫ్టీ హాఫ్ సెంచరీ చేసింది. దాదాపు అన్ని రంగాల స్టాక్స్ లాభాలలో కదలాడాయి. ఆ టో, ఎఫ్ఎంస ీజీ, ఎనర్జీ షేర్లు మార్కెట్ల ర్యాలీకి ఊతమిచ్చాయి. దీంతో కీలక సూచీలు కీలక మద్దతుస్థాయిలను అధిగమిం చాయి. మూ రత్ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 246 పా యింట్లు ఎగసి 35,238 వద్ద స్థిరపడింది.
దీంతో కీలక సూచీ 35,000 పాయింట్ల మైలురాయిని దాటి నట్టయింది. మరోవైపు ఎన్ఎస్ ఈ సూచీ నిఫ్టీ సైతం 68 పాయింట్లు పెరిగి 10,598 పాయింట్ల వద్ద ముగిసింది. ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, హెచ్పీ సీఎల్, బీపీసీఎల్లు మేటిగా రాణించాయి.
గతేడాది లాభం ఏడు శాతమే..
మధ్యంతర ఎన్నికల నేపథ్యంలోనూ యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభపడటం, ఆసియా మార్కెట్లు లాభాల్లో నిలవడం కూడా దేశీయ మదుపరుల సెంటిమెం టుకు బలాన్నిచ్చింది. మరోవైపు 'దివాలీ బలిప్రతిపాద' సందర్భంగా గురువారం స్టాక్ మార్కె ట్లు పని చేయలేదు.శుక్రవారం ఉదయం యథా విధిగా 9.15 నిమిషాలకు మార్కెట్లలో ట్రేడింగ్ తిరిగి ప్రారంభం కానుంది. సంవత్ 2074కు స్టాక్ మార్కెట్లు లాభాలతో వీడ్కోలు పలికాయి. ఏడాది మొత్తం (గత దీపావళి నుంచి బుధవారం నాటి దీపా వళి వరకు) చూస్తే.. బీఎస్ఈ సెన్సెక్స్ 2,407.56 పాయింట్లు (7 శాతం), నిఫ్టీ 319.15 పాయింట్లు (3 శాతం) లాభపడ్డాయి. ఇక దీపావళి పండగ సెల వుల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహ రించ డంతో సూచీలు ఒడుదొడుకులు మధ్య కదలాడాయి