Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గతంలో కేవలం మగువలకే పరిమి తమైన సౌందర్య పోషణ అభిరుచి ఇటీవలి కాలంలో పురుషుల్లోనూ పెరిగి పోతొందని అంత ర్జాతీయ సౌందర్య పోషణ ఉత్పత్తుల పంపిణీ సంస్థ ఎస్ఎస్ఐజడ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రెయేడ్ మర్చంట్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అంతార్జాతీయ పురుషుల సౌందర్య పోషణ ఉత్పత్తులైన డిపో, ఐకానిక్ లక్సరిన్లను తెలంగాణ మార్కెట్లోకి ఆయన విడుదల చేశారు. దేశంలో ఆదాయ వనరులు పెరుగుతన్న నేపథ్యంలో ఈ రంగంలో మేటి వృద్ధి నమోదు అవుతూ వస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్రర్్స సెలూన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ విజయలక్ష్మి గుడిపాటి, సినీ నటి, యాంకర్ సమీట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్షో చూపరులను ఆకర్షించింది.