Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కారు కార్పొరేట్ రంగానికి మేలు చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల్ని వినియోగిం చుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఆరు వర్ధమాన విమానాశ్రయాలను ప్రయివేటీకరించాలని నిర్ణయించింది. లక్నో, అహ్మాదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గౌహతి విమానాశ్రయాలను ప్రయివేటీకరించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం-ప్రయివేటు భాగస్వామ్యంలో (పీపీపీ)భాగంగా ఈ ఎయిర్పోర్టులను అభివృద్ధి పరిచేలా తాము నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 2006లో ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాలను ప్రయివేటీకరించిన దాదాపు పుష్కర కాలం తరువాత మరో ఆరు విమానాశ్రయాలను పీపీపీ ప్రయివేటీకరించాలని మోడీ సర్కరు నిర్ణయం తీసుకోవడం విశేషం.