Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాణిజ్య విభాగం: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ సంస్థ హైదరాబాద్లో తమ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయను న్నట్టుగా ప్రకటించింది. భారత్లో తమ విస్తరణ ప్రణాళికలను గురించి చర్చించేందుకు గాను ఇంటెల్ ఇండియా అధిపతి నివృతిరారు రారు నేతృత్వంలోని ప్రతనిధుల బృందం శుక్రవారం మంత్రి కేటీ రామారావుతో సమావేశం అయ్యారు. హైదరాబాద్లో తమ సెంటర్లో ఏర్పాటు ద్వారా దాదాపు 1500 మంది ఐటీ నిపుణులకు కొలువులు దొరకనున్నట్టుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను 5 వేల వరకు పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. తాజాగా హైదరాబాద్ నగరానికి ఇంటెల్ వచ్చేందుకు ఆసక్తి చూపడంతో రానున్న రోజుల్లో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఏర్పడనున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.