Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలంగాణలో తొలిసారిగా వ్యర్థాలతో విద్యుత్తును ఉత్పత్తి చేసే (వెట్) 12 మె.వా. సామర్థ్యంతో కూడిన ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్టు నెట్లింక్స్ సంస్థల చైర్మెన్ లోక మనోహర్ రెడ్డి వెల్లడించారు. నెట్లింక్స్ అనుబంధ హరిత విద్యుత్తు ఉత్పత్తి సంస్థ శ్రీ వెంకటేశ్వరా గ్రీన్ పవర్ ప్రాజెక్ట్స్ రూ.258 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ ప్రాజెక్టులో జపాన్కు చెందిన ఇన్వెష్ట్మెంట్ సంస్థలు థకారా లెబన్, కుని ఉమి అసెట్స్ మేనేజ్మెంట్ కంపెనీలు ఒక్కొక్కటి 30 శాతం (రూ. 78 కోట్ల మేర)పెట్టుబడి పెట్టనున్నట్టుగా మనోహర్ రెడ్డి వెల్లడించారు. రోజుకు హైదరాబాద్లో నుండి వెలువడే 700 టన్నుల చెత్తను ప్రధాన ఇంధనంగా వాడుకొని.. 12 మె.వా విద్యుత్తు ప్లాంట్ను నడిపించనున్నట్టుగా ఆయన వెల్లడించారు. నగరానికి దక్షిణాన ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటి సమీపంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన వెల్లడించారు. 18-24 నెలలోఈ విద్యుత్తు ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్లాంట్ను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఏర్పాటు చేస్తున్నామని.. దీనికి హిటాచీ జోసెన్ సంస్థ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. హైదరాబద్తో మొదలుకొని తెలంగాణలో మొత్తం ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగ రానున్న అదేండ్ల కాలంలో రూ. రూ.2600 కోట్ల వ్యయంతో మొత్తం 10 ప్లాంటులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టుగా ఆయన తెలిపారు. జపాన్ సంస్థల పెట్టుబడులు పోను.. మిగతా పెట్టుబడిని తాము వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకోనున్నట్టుగా ఆయన వివరించారు.