Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారతీయులకి సరైన అవకాశాల్ని కల్పిస్తే అద్భుతంగా ఎదుగుతారని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం) డైరెక్టర్, రమణన్ రామనాథన్ అన్నారు. తగిన తోడ్పాటు అందిస్తే సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చయ్య వంటి గొప్పవారిని వేలాది మందిగా తయారు చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో 65% మంది 35 సంవత్సరాల లోపు వయసు వారేనని.. ఇటువంటి శక్తి సామర్థ్యాలు గల యువశక్తి భారతదేశానికి గొప్ప సంపదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన 'ది థింగ్స్ కాన్ఫరెన్స్ ఇండియా' సదస్సును శుక్రవారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సులకు దేశ, విదేశాల నుంచి ప్రపంచ సాంకేతిక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, విద్యావేత్తలు, పరిశోధన సంస్థలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' మరియు 'లోరావ్యాన్' టెక్నాలజీలు అందించే అపార అవకాశాల గురించి ఈ సదస్సులో చర్చించారు. ఈ టెక్నాలజీలు స్మార్ట్ నగరాలను ప్రభావవంతమైన మార్గంలో, వ్యయ, ప్రయాసలు తగ్గిస్తూ నిర్మించడానికి సహకరిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సుకు తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ అధ్యక్షురాలు, కరుణ గోపాల్, తదితరులతో పాటు ఇండియాను స్మార్ట్ దేశంగా మార్చే దిశగా క షి చేస్తున్న పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరియు లోరావ్యాన్ గ్లోబల్ లీడర్స్, థింగ్స్ ఇండిస్టీస్ సీఈఓ మరియు కో-ఫౌండర్ వియాంక్ గీజ్మెన్ , ది థింగ్స్ నెట్వర్క్ సీటీవో అండ్ కో-ఫౌండర్ యోహాన్ స్టాకింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ - మల్టీ టెక్ సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కందికొండ తదితరులు పాల్గొన్నారు.