Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశానికి వెన్నెముకగా నిలుస్తోన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించేలా ప్రభుత్వ విధానాలు ఉండకూడదని 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ (హైదరాబాద్ సర్కిల్)' (ఎస్బీఐవోఏ-హెచ్సీ) ప్రభుత్వానికి హితవు పలికింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఎస్బీఐవోఏ-హెచ్సీ 32వ వార్షిక సమావేశంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక తీర్మానాన్ని అమోదించి ప్రభుత్వానికి పంపారు. ప్రయివేటీకరణ వ్యతిరేకతతతో పాటు బ్యాంకుల్లో వేలాదిగా ఉన్న ఖాళీలను భర్తీ, కారుణ్య నియామకాలు, స్పోర్ట్స్ కోటా నియమకాలను వెంటనే చేపట్టాలని ఎస్బీఐవోఏ-హెచ్సీ సర్కారును కోరింది. మొత్తం తొమ్మిది తీర్మానాలను ఈ సమావేశంలో ఆమోదించి సర్కారుకు విన్నవించారు. ఈ సమావేశానికి ఎస్బీఐవోఏ-హెచ్సీకు చెందిన దాదాపు 2500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్బీఐ హైదరాబాద్సర్కిల్ సీజీఎం స్వామినాథన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ హైకోర్టుకు చెందిన జడ్జి ఎ.వి.శేషశాయి ఎస్బీఐవోఏ-హెచ్సీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్బీఐవోఏ చైర్మెన్ జి. సుబ్రహ్మణ్యమ్ నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐవోఏ ఉపాధ్యక్షుడు, ఎస్బీఐవోఏ-హెచ్సీ హైదరాబాద్ అధ్యక్షులు బి. సుక్కయ్య తదితరులు ప్రసంగించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకుగాను సికింద్రాబాద్, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసస్కు చెందిన వి. ఆంజనేయులు, బి.రఘునందమ్ విశేష కృషి చేశారు.