Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో విమాయనాన్ని అందిస్తోన్న ఎయిర్ ఏషియా సంస్థ తన ప్రమోషనల్ ఆఫర్గా రూ.399 లకే విమాన టికెట్లు అందిస్తున్నట్టుగా ప్రకటించింది. సోమవారం నుంచి ఈ నెల 18 దాకా ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా మే 6, 2019 నుంచి ఫిబ్రవరి 4, 2020 వరకు ప్రయాణించే అవకాశం ఉంది. వన్వేలో దేశీయంగా రూ.399, అంతర్జాతీయ మార్గాల్లో 1999 రూపాయలకే టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టుగా కంపెనీ తెలిపింది. హైదరాబాద్, విశాఖపట్నం తోపాటు, బాగ్దోగ్రా, బెంగళూరు, భువనేశ్వర్, గోవా, గువహటి, ఇంఫాల్, ఇండోర్, జైపూర్, కొచ్చి, కోలకతా, న్యూఢిల్లీ, పుణ్, రాంచీ, శ్రీనగర్లకు ఈ ఆఫర్ కింద టికెట్లను అందిస్తోన్నట్టుగా సంస్థ తెలిపింది. ఎయిర్ ఏసియా వెబ్సైట్, లేదా యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. బీగ్ మెంబర్స్కు ఈ ఆఫర్లో ప్రత్యేకత సౌకర్యాన్ని అందిస్తున్నట్టుగా సంస్థ తెలిపింది.