Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: సూక్ష్మ గణంకాలపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో సోమవారం భారత మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. మరోవైపు డాలర్తో రూపాయి విలువ 73కు పడిపోవడం, ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం, ప్రపంచ మార్కెట్లు ప్రతికూలతతదితర పరిణామాల మధ్య మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారకున్నాయి. రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనైన సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 346 పాయింట్లు నష్టంతో 34,813 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇ సూచీ నిఫ్టీ 103 పాయింట్లు కోల్పోయి 10,482 వద్ద ముగిసింది.సూక్ష్మ గణంకాలు బలహీనంగా ఉండొచ్చన్న అంచనాల మధ్య మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారని నిపుణులు విశ్లేషించారు .డిసెంబర్లో చమురు సరఫరాను తగ్గించనున్నామని సౌది అరేబియా ప్రధాన ఎగుమతిదారు ప్రకటి ంచడంతో ముడి చమురు ధరలు మళ్లీ 1.5 శాతం పెరిగాయి. దీంతో కరెంట్ ఎకౌంట్ లోటు పెరగనుందన్న భయాల్లో మదుపర్లు మార్కెట్లపై విశ్వాసం కోల్పోయారు. ఇంట్రా డేలో డాలర్తో రూపాయి మారకం విలువ 57 పైసలు మేర కోల్పోయి 73కు పడిపోవడమూ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. తుదకు 38 పైసల క్షీణతతో 72.88 వద్ద ముగిసింది.