Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశ విదేశాల నుంచి తెలంగాణకు వచ్చే అతిథులకు మెరుగైన ఆతిథ్యపు సేవలను అందించేందుకు గాను తమ సంస్థ కార్యకలాపాల విస్తరణను కొనసా గిస్తామని తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ డైరెక్టర్ కె. మోహనచంద్రన్ తెలిపారు. హైదరాబాద్కు ప్రత్యేకంగా నిలిచే పలు రుచికరమైన వంట కాలను అందుబాటులో ఉంచేలా తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన ఫిరదోస్ రెస్టారెంట్ సేవలను ఆయన మంగళవారం పున:ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు ఎక్కువగా హైదరాబాద్ వంటకాలను ఇష్టపడుతుంటారని వారి కోసం ఫిరదోస్ను సరికొత్తగా ఆధునికీకరించినట్టుగా తెలిపారు. హైదరాబాదీతో పాటుగా నార్త్ వెస్ట్రన్ ఇండియన్ డిషెస్కు ఫిరదోస్ రాష్ట్రంలోనే కొత్త చిరునామాగా నిలువనుందని ఆయన తెలిపారు.