Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ప్రముఖ టెక్నాలజీ సంస్థ, ఐ-ఫోన్ తయారీదారు ఆపిల్ సంస్థ ఇండియాలో కొత్త బాస్గా ఆశిష్ చౌదరి ఎంపికయ్యా రు. నోకియా సంస్థలో చీఫ్ కస్టమర్ ఆపరేషన్స్ ఆఫీసర్గా ఉన్న ఆశిష్ను ఇండియా ఆపరేషన్స్ హెడ్గా నియమిస్తున్నట్టుగా ఆపిల్ సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించలనున్నారు. చీఫ్ బిజినెస్ ఆఫీసర్గా నోకియా అమ్మకాలు, కార్యకలా పాలకు ప్రపంచ వ్యాప్తంగా బాధ్యత వహించిన ఆశిష్ చౌదరి నోకియా పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. వ్యాపార, టెలికాం రంగాల్లో 25 సంవత్సరాల అనుభవం ఆయన సొంతం. కాగా 2018 క్యూ4 లో ఇండియాలో ఆపిల్కు డిమాండ్ గణనీయంగా క్షీణించినప్పటికీ భవిష్యత్తు ప్రయోజనాల రీత్యా ఆపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.