Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉర్జిత్-మోడీ భేటీపై అనుమానాలు..
- రహస్య మంతనాలపై సర్వత్రా ఆసక్తి
- వివరాలు వెల్లడించని ఇరు వర్గాలు..
- 'పటేల్' మైండ్సెట్ మార్చడంలో సక్సెస్!
- భవిష్యత్తులో ఇక అన్నీ అనుకూల నిర్ణయాలేనా..
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంతో, భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నరుకు పొసగడం లేదన్న విషయం దేశంలో సంచలనంగా మారుతుండడంతో స్వయంగా ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) నష్ట నివారణ చర్యలకు దిగినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే గత శుక్రవారం (ఈనెల 9న) ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ రిజర్వు బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను రహస్యంగా తన కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడి నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఎలాంటి సమాచారం లేకుండా ఢిల్లీ వచ్చిన ఉర్జిత్ పటేల్ ప్రధానమంత్రి కార్యాల యంలోని సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపా రన్నది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధానితోనూ ఉర్జిత్ పటేల్ భేటీ అయ్యారని వివిధ అంశాలపై స్పష్టతని చ్చినట్టుగా పీఎంవో వర్గాలు చెబుతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో, రుణ నిబంధనలను ఆర్బీఐ సరళీకరించాలని ప్రభుత్వం కోరుకుంటున్న నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కేంద్రంతో వివాదాస్పద అంశా లను పరిష్కరించుకునే దిశగా రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోందని.. ఇందులో భాగంగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గత వారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన ట్లుగా ప్రభుత్వం అనుకూల మీడియా ప్రచారం సాగిస్తోంది. పట్టింపులకు పోకుండా రెండు పక్షాలూ కొన్ని విషయాల్లో సర్దుకు పోవాలని నిర్ణయించినట్టు ఈ మీడియా కథనాలను వెల్లడిస్తుండడం విశేషం. అయితే ఈ విషయమై ఇటు ప్రభుత్వం నుంచి గానీ అటు ఆర్బీఐ నుంచి గానీ అధికారి కంగా ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం-ఆర్బీఐ మధ్య వివాదం తారాస్థాయికి చేరి ఈనెల 19న బోర్డు సమావేశం సందర్భంగా, ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనా మా చేయనున్నారన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో ఉర్జిత్ రహస్యంగా ప్రధానితో సమావేశం కావడం పలు అనుమాల నుకు తావిస్తోంది.
ఎస్ఎంఈ రుణాల విషయంలో ఏకాభిప్రాయం..
చర్చల నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలివ్వడానికి సంబంధించి ఆర్బీఐ ప్రత్యేక విధానమేదైనా రూపొందించే అవకాశమున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నా యని సంబం ధిత వర్గాలు తెలిపాయి. అయితే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీ ఎఫ్సీ) లిక్విడిటీ సమస్యలు తీర్చడం, రిజర్వ్ బ్యాంక్ దగ్గరున్న మిగులు నిధుల్లో గణనీయ భాగాన్ని ప్రభుత్వానికి బదలాయించడం వంటి అంశాలపై ఏదైనా అంగీకారం కుదిరి ందా లేదా అన్నది తెలియ రాలేదు. అయితే దీనికి సంబంధించి భవిష్య త్తులో ఆర్బీఐ వ్యవహిరించాల్సిన తీరను గురించి పీఎంవో ఉర్జిత్కు దిశానిర్దేశం చేసినట్టుగా చెబుతున్నారు. ద్రవ్య లోటు పూడ్చుకునేందుకు ఆర్బీఐ దగ్గర ఉన్న రూ.9.6 లక్షల కోట్ల రిజర్వు నిధుల్లో రూ.3.6 లక్షల కోట్లు ఇవ్వాలని ప్రభు త్వం కోరడంతో.. రెండు పక్షాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వద్ద ఉండాల్సిన నిధులను గురించి నిర్ణయించేందుకు గాను నిర్ణయం తీసుకొనేలా సర్కారు ఒక కమిటీని ఏర్పాటు చేయా లని ప్రతిపాదించినట్టుగా సమాచారం. ఇదే విషయమై 19న జరిగే బోర్డు సమావేశంలో ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
అంత రహస్యమెందుకు..
ప్రభుత్వ అనుకూల మీడియా చెబుతున్నట్టుగా వివిదా ల పరిష్కారానికి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ స్వయంగా ప్రధాని వద్దకు వెళ్లి ఉంటే.. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు వెల్లడించేవారు. ఆర్బీఐని నిర్వీర్య చేస్తున్నారన్న వార్తలను ఖండించేందుకు ఈ సమావేశాన్ని ప్రత్యక్ష నిదర్శ నంగా చూపే వారని వారు చెబుతున్నారు. అయితే రహ స్యంగా ఉర్జిత్ పీఎంవోకు వచ్చి మౌనంగా వెళ్లిపోవడం.. పలు అనుమానాలకు తావిస్తోందని వారు అభిప్రాయపడు తున్నారు. ఉర్జిత్ తీరు చూస్తుంటే ఆయనే ప్రభుత్వంతో రాజీ పడేందుకు వచ్చినట్టుగా లేదని.. పీఎంవోనే ఆయన్ని అనధి కారికంగా పిలిపించుకున్నట్టుగా ఉందని కొందరు చెబుతు న్నారు. ఏదీ ఏమైనా ఈ సమావేశంలో ఏ దిశగా చర్చలు జరిగాయన్నది 19న ఆర్బీఐ బోర్డు తీసుకొనే నిర్ణయాల రూ పంలో వెల్లడి కానుందని ఆర్థిక విశ్లేషకులు చెతుతున్నారు.