Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న ద్రవ్యోల్బణ లెక్కలకు పొంతన లేకుండా పోతుంది. సాధారణంగా టోకు ద్రవ్యోల్బణం పెరిగితే అదే బాటలో రిటైల్ ద్రవ్యల్బణం కూడా పెరగాలి. ఇందుకు భిన్నంగా అక్టోబర్ మాసంలో టోకు ధరలు పెరగ్గా, రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ తగ్గింది. ప్రస్తుత ఏడాది అక్టోబర్లో చమురు ధరలు అధికంగా ఉండటంతో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపీఐ) 5.28 శాతానికి ఎగిసిందని బుధవారం కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. దీంతో ఇది నాలుగు నెలల గరిష్ఠానికి డబ్ల్యుపిఐ చేరిందని తెలిపింది. సెప్టెంబరు నెలలో ఇది 5.13 శాతంగా ఉంది. గతేడాది అక్టోబరులో 3.68శాతంగా చోటు చేసుకుంది. సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబర్లో ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 16.65శాతం నుంచి 18.44శాతానికి ఎగిశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 19.85శాతం, 23.91శాతం పెరిగాయి. మరోవైపు క్రితం అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 3.31 శాతానికి తగ్గిందని సోమవారం కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.69 శాతానికి తగ్గి 10 మాసాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గిందని గణంకాల శాఖ పేర్కొంది. ఒకే వారంలో ఇచ్చిన ఈ భిన్న రిపోర్టులపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.