Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రిటైల్ ఔషధ విక్రయాల విభాగం 'అపోలో ఫార్మసీ'ని ప్రత్యేక సంస్థగా మార్చాలని నిర్ణయించినట్టుగా 'అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్' (ఏహెచ్ఈ) వెల్లడించింది. సంస్థ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా అపోలో ఫార్మసీని ప్రత్యేక సంస్థగా మార్చాలని నిర్ణయించామని సంస్థ మార్కెట్ నియంత్రణ సంస్థలకు సమాచారం అందించింది. మొత్తం రూ.527.8 కోట్ల నగదుతో అపోలో ఫార్మసీని ప్రత్యేక సంస్థగా మార్చే ప్రతిపాదనకు బుధవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డు సమ్మతి తెలిపిందని ఏహెచ్ఈ వెల్లడించింది. ఇకపై అపోలో ఫార్మసీ సంస్థ అపోలో మెడికల్స్ ప్రయివేటు లిమిటెడ్ (ఏఎంపీఎల్) అనుబంధ సంస్థగా కొనసాగుతుందని ఏహెచ్ఈ తెలిపింది. కొత్తగా ఏర్పడనున్న సంస్థలో తాము 25.5 శాతం వాటా ఉండనున్నట్టుగా కూడా ఈ సంస్థ తెలిపింది. ఏఎంపీఎల్లో జెలూమ్ ఇన్వెష్ట్మెంట్ ఫండ్-1 19.9 శాతం వాటాను, హేమేంద్ర కొఠారీ 9.9 శాతం వాటాను, ఎమామ్ సెక్యూరిటీస్ ప్రయివేట్ లిమిటెడ్ 44.7 శాతం వాటాను కలిగి ఉన్నాయి. దీర్ఘకాలంలో ఆరోగ్య సంరక్షణ, ఔషధ వ్యాపారాలను విడి విడిగా అభివృద్ధి బాట పట్టించాలన్న వ్యూ హంలో భాగం గానే అపోలో యాజ మాన్యం ఈ నిర్ణయం తీసుకు న్నట్టుగా ఏహెచ్ఈ తెలిపింది. రానున్న ఐదేండ్ల కాలంలో 5000 ఫార్మా అవుట్లెట్స్ను ప్రారంభించి.. రూ.10,000 కోట్లు ఆదాయాన్ని ఆర్జించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా సంస్థ తెలిపింది. ఇందులో భాగంగానే సంస్థ పునర్ నిర్మాణం ప్రణాళిక వేసినట్టుగా ఏహెచ్ఎల్ తెలిపింది. ప్రస్తుతం అపోలో ఫార్మసీ సంస్థ 20 రాష్ట్రాలు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిసి 400 నగరాలలో 3617 అవుట్లెట్లను కలిగి ఉంది. తాజా చర్యతో అపోలో ఫార్మసీ సేవలను అవుట్లెట్లతో సహా ఆన్లైన్లో కూడా అందించేందుకు వీలు పడుతుందని సంస్థ తెలిపింది.