Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ను టార్గెట్ చేసిన సర్కారు! ొ దిగిరాకుంటే.. అవిశ్వాసం దిశగా అడుగులు..
- తాజా ఎత్తుతో మిగతా వారిని 'సెట్' చేసేలా వ్యూహం ొ అస్త్రాలను తయారు చేస్తున్న ప్రభుత్వం వర్గాలు..!
- దారికి రాకుంటే.. తెరపైకి పూర్తిస్థాయిలో 'సెక్షన్-7'
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంక్తో (ఆర్బీఐ) ఏర్పడిన అభిప్రాయ బేధాలు కొలిక్కి రాని పక్షంలో.. ఇక దూకుడుగానే ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 19న జరిగే ఆర్బీఐ బోర్డు సమావేశంలో పరిణామాలను బట్టి భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం తన అస్త్రాలను సమాయత్తం చేస్తున్నట్టుగా సమాచారం. తొలత ఆర్బీఐ-కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాన్ని బయటి ప్రపంచానికి తెలిసేలా ప్రవర్తిస్తూ.. ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన ఆర్బీఈ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యపై కక్ష్య సాధింపు చర్యలతో దూకుడును మొదలు పెట్టాలని సర్కారు వర్గాలు భావిస్తున్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాలను ఉటంకిస్తూ 'మింట్' ఒక కథనాన్ని వెలువరించింది. 19 జరగనున్న రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశంలో విరాల్ను బాధ్యతల నుంచి తప్పించడానికి మిగితా డైరెక్టర్లతో ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారని పేరు చెప్పుకోవడానికి ఆసక్తి చూపని ఒక అధికారి వెల్లడించారు. బోర్డు సమావేశం నాటికి ఉర్జిత్, విరాల్తో సహా ఆర్బీఐ కీలక కార్యవర్గం దారికొస్తే సరి..! లేకుంటే వచ్చే బోర్డు మీటింగ్లో సెక్షన్-7లోని వెసులుబాటును ఉపయోగిస్తూ విరాల్ ఆచార్యపై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురావాలన్నది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. ఆర్బీఐ అంతర్గత సున్నిత విషయాలను బయటకు వెల్లడించడాన్ని తప్పుబడుతూ 11 మంది సభ్యుల్లో కనీసం నలుగురు ఆచార్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఇంటికి పంపించే అవకాశాలు ఉన్నాయని సదరు వర్గాలు తెలిపాయి. విరల్పై వేటు వేయడం ద్వారా మిగతా అధికారులకు ప్రభుత్వ సీరియస్నెస్ను పరోక్షంగా వెల్లడించాలన్న అంతర్గత యోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. విరాల్ వికెట్ పడితే.. మిగతా అధికారులు సర్దుకుంటారని.. అప్పుడు ఆర్బీఐని ఇంటి సంస్థగా మార్చుకోవాలన్న తమ పని కూడా చాలా సులువవుతుందన్నది ప్రభుత్వంలోని కొందరు అధికారుల భావనగా తెలుస్తోంది.
ఒక్క రోజు సమావేశంలో విషయం తేలేనా..
నవంబర్ 19న ఆర్బీఐ మీటింగ్లో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ప్రసంగంతో ప్రారంభం కానుంది. ఆ తరువాత ఆర్బీఐ తరఫున ఉర్జిత్ పీపీటీ ప్రసంగం ఉండనుంది. తదుపరి అంశంగా ఈ సారి సమావేశంలో సెక్షన్-7పై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గత అక్టోబర్లో జరిగిన బోర్డు మీటింగ్లో ఆర్ధిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ప్రసంగం తర్వాత ఎనిమిది గంటల పాటు బోర్డు సమావేశం జరిగింది. ఈ సమయమంతా ప్రధానంగా రెండు అంశాలపైనే చర్చించారు. అయినా ఒక ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ పాల్గొనలేదు. ఈ సారి విరాల్ ఆచార్య వాక్యలను బహిరంగంగా మీడియా ముందు ఎద్దేవా చేసిన గార్గ్ ఆయనపై కక్ష్య సాధింపునకు గాను బోర్డు సమావేశానికి అవసరమైన అస్త్రాలను సమాయత్తం చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో 19న ఒక్కరోజు మాత్రమే షెడ్యూల్ చేసిన బోర్డు సమావేశంలో కూడా ఎలాంటి నిర్మాణాత్మక నిర్ణయాలను ఆశించలేమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంక్తో (ఆర్బీఐ) ఏర్పడిన అభిప్రాయ బేధాలు కొలిక్కి రాని పక్షంలో.. ఇక దూకుడుగానే ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 19న జరిగే ఆర్బీఐ బోర్డు సమావేశంలో పరిణామాలను బట్టి భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం తన అస్త్రాలను సమాయత్తం చేస్తున్నట్టుగా సమాచారం. తొలత ఆర్బీఐ-కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాన్ని బయటి ప్రపంచానికి తెలిసేలా ప్రవర్తిస్తూ.. ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన ఆర్బీఈ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యపై కక్ష్య సాధింపు చర్యలతో దూకుడును మొదలు పెట్టాలని సర్కారు వర్గాలు భావిస్తున్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాలను ఉటంకిస్తూ 'మింట్' ఒక కథనాన్ని వెలువరించింది. 19 జరగనున్న రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశంలో విరాల్ను బాధ్యతల నుంచి తప్పించడానికి మిగితా డైరెక్టర్లతో ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారని పేరు చెప్పుకోవడానికి ఆసక్తి చూపని ఒక అధికారి వెల్లడించారు. బోర్డు సమావేశం నాటికి ఉర్జిత్, విరాల్తో సహా ఆర్బీఐ కీలక కార్యవర్గం దారికొస్తే సరి..! లేకుంటే వచ్చే బోర్డు మీటింగ్లో సెక్షన్-7లోని వెసులుబాటును ఉపయోగిస్తూ విరాల్ ఆచార్యపై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురావాలన్నది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. ఆర్బీఐ అంతర్గత సున్నిత విషయాలను బయటకు వెల్లడించడాన్ని తప్పుబడుతూ 11 మంది సభ్యుల్లో కనీసం నలుగురు ఆచార్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఇంటికి పంపించే అవకాశాలు ఉన్నాయని సదరు వర్గాలు తెలిపాయి. విరల్పై వేటు వేయడం ద్వారా మిగతా అధికారులకు ప్రభుత్వ సీరియస్నెస్ను పరోక్షంగా వెల్లడించాలన్న అంతర్గత యోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. విరాల్ వికెట్ పడితే.. మిగతా అధికారులు సర్దుకుంటారని.. అప్పుడు ఆర్బీఐని ఇంటి సంస్థగా మార్చుకోవాలన్న తమ పని కూడా చాలా సులువవుతుందన్నది ప్రభుత్వంలోని కొందరు అధికారుల భావనగా తెలుస్తోంది.
ఒక్క రోజు సమావేశంలో విషయం తేలేనా..
నవంబర్ 19న ఆర్బీఐ మీటింగ్లో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ప్రసంగంతో ప్రారంభం కానుంది. ఆ తరువాత ఆర్బీఐ తరఫున ఉర్జిత్ పీపీటీ ప్రసంగం ఉండనుంది. తదుపరి అంశంగా ఈ సారి సమావేశంలో సెక్షన్-7పై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గత అక్టోబర్లో జరిగిన బోర్డు మీటింగ్లో ఆర్ధిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ప్రసంగం తర్వాత ఎనిమిది గంటల పాటు బోర్డు సమావేశం జరిగింది. ఈ సమయమంతా ప్రధానంగా రెండు అంశాలపైనే చర్చించారు. అయినా ఒక ఏకాభిప్రాయానికి రాలేక పోయారు. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ పాల్గొనలేదు. ఈ సారి విరాల్ ఆచార్య వాక్యలను బహిరంగంగా మీడియా ముందు ఎద్దేవా చేసిన గార్గ్ ఆయనపై కక్ష్య సాధింపునకు గాను బోర్డు సమావేశానికి అవసరమైన అస్త్రాలను సమాయత్తం చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో 19న ఒక్కరోజు మాత్రమే షెడ్యూల్ చేసిన బోర్డు సమావేశంలో కూడా ఎలాంటి నిర్మాణాత్మక నిర్ణయాలను ఆశించలేమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.