Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ మౌలిక వసతుల కంపెనీ జిఎంఆర్ ఇన్ఫ్రా 2018-19 జులై నుంచి సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో నికర నష్టాలను రూ.218.86 కోట్లకు తగ్గించుకుంది. గతేడాది ఇదే సమయంలో రూ.404.46 కోట్ల నష్టాలు చవి చూసింది. ఇదే సమయంలో రూ.1,980.92 కోట్ల మొత్తం ఆదాయాన్ని ప్రకటించగా, క్రితం క్యూ2లో 2.61 శాతం పెరుగుదలతో రూ.2,025.72 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో జిఎంఆర్ ఇన్ఫ్రా విమానాశ్రయాల వ్యాపారం 11.86 శాతం వృద్ధితో రూ.1,315.52 కోట్లకు చేరింది. విద్యుత్ సెగ్మెంట్ రెవెన్యూ 41.93 శాతం పతనమై రూ.178.17 కోట్లుగా చోటు చేసుకుంది. రోడ్ల వ్యాపారం 8.52 శాతం తగ్గి రూ.134.7 కోట్లుగా నమోదయ్యింది. గురువారం బిఎస్ఇలో జిఎంఆర్ ఇన్ఫ్రా షేర్ 0.31 శాతం తగ్గి రూ.16.15 వద్ద ముగిసింది.