Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది అక్టోబర్లో భారత వాణిజ్య లోటు 17.86 బిలియన్ డాలర్లకు ఎగిసింది. అధిక చమురు దిగుమతులు లోటును పెంచాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక రిపోర్టులో తెలిపింది. ఇంతక్రితం సెప్టెంబర్ మాసంలో ఈ లోటు 13.98 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకుంది. 2017 ఇదే అక్టోబర్లో 14.61 బిలియన్ డాలర్ల లోటు నమోదయ్యింది. క్రితం అక్టోబర్లో ఎగుమతులు 17.86 శాతం వృద్ధితో 26.98 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే మాసంలో దిగుమతులు 17.62 శాతం పెరిగి 44.11 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోనే చమురు దిగుమతుల్లో భారత్ మూడో అతిపెద్ద దేశంగా ఉంది. దేశం మొత్తం చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతుల నుంచి సమకూర్చుకుంటున్నదే.
గత నెలలో చమురు దిగుమతులు 52.64 శాతం ఎగిసి 14.21 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం అక్టోబర్లో పసిడి దిగుమతులు 42.9 శాతం తగ్గి 1.68 బిలియన్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో దేశ ఎగుమతులు 13.27 శాతం పెరిగి 191 బిలియన్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు 16.37 శాతం పెరిగి 302.47 బిలియన్లకు ఎగిశాయి. దీంతో ఈ ఏడు నెలల కాలంలో దేశ వాణిజ్య లోటు 111.46 బిలియన్ డాలర్లకు చేరింది. దిగుమతులు పెరిగి ఎగుమతులు తగ్గడం ద్వారా వాణిజ్య లోటు ఏర్పాడుతుంది. 2017-18 కాలలో వాణిజ్య లోటు 91.28 బిలియన్లుగా చోటు చేసుకుంది.