Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర రూ.1.55-1.89 లక్షలు..
ముంబయి: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అనుబంధ సంస్థ అయిన క్లాసిక్ లెజెండ్స్ ప్రముఖ మోటార్సైకిల్ బ్రాండ్ 'జావా'ను తిరిగి భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దాదాపు 22 ఏండ్ల తర్వాత చెక్ రిపబ్లిక్కు చెందిన కంపెనీ భారత్లో జావా బ్రాండ్ బైక్లను లాంచ్ చేసింది. జావా, జావా 42, జావా పెరెక్ అనే మూడు మోడల్స్ను విడుదల చేసింది. ఈ బైక్స్ ధరలు రూ.1.55 లక్షల నుంచి రూ.1.89లక్షల (ఎక్స్షోరూమ్, న్యూఢిల్లీ) మధ్య ఉన్నాయని వెల్లడించింది. ఈ మూడు బైక్స్లో 293సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. 293 సీసీీ సామర్థ్యం కలిగిన సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్షన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 27 హెచ్పీ, 28 ఎన్ఎమ్ టార్క్ శక్తిని అందిస్తుంది. 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, రౌండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, గుండ్రని హెడ్ లాంప్స్, డ్యూయల్ టోన్ క్రోమ్ ఫినిష్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, ట్విన్ ఎగ్జాస్ట్స్, ఫ్లాట్ జీడిల్. చైన్ కవర్, ఇతర ప్రధాన ఫీచర్లు. జావా బ్రాండ్ మహీంద్రా విలువల్ని మరింత పెంచుతుందని బైక్స్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. జావా బైక్స్ను భారత్లో ప్రవేశపెట్టేందుకు 2016లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చెక్ రిపబ్లిక్కు చెందిన మోటార్సైకిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం నుంచే బైక్స్ కోసం ఆన్లైన్లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే వచ్చే 7వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.