Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాల్లో 46 శాతం వృద్ధికి అవకాశం..
- కొత్త టెక్నాలజీలపైనే అత్యధికంగా జాబ్స్..
- 2027 నాటికి 50 లక్షల మేర కొలువులు
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో భారత ఐటీ రంగంలో దండిగా కొత్త కొలువులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ప్రముఖ ఐటీ సంస్థ సిస్కో, ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్లు కలిసి నిర్వహించిన సంయుక్తం అధ్యయనం ప్రకారం.. 2027 నాటికి కొత్తగా దాదాపు 14 లక్షల ఐటీ కొలువుల అందుబాటులోకి రానున్నట్టుగా తేలింది. ఇది ప్రాథమికంగా ఐటీ కొలువుల్లో 46 శాతం వృద్ధిని సూచిస్తోందని అధ్యయనం తెలిపింది. టెక్నాలజీ సంస్థలు కొత్తగా అందుబాటులోకి వస్తోన్న డిజిటల్ పరివర్తన టూల్స్, సాంకేతీకతలపై ఆసక్తి చూపుతున్నాయని.. ఈ నేపథ్యంలో కొత్త కొలువులు ప్రధామికంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలైన సైబర్ టెక్నాలజీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), బిగ్ డేటాలపైనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని స్టడీ వివరించింది. ఐడీసీ ఇన్ఫోబ్రీఫ్ 'ది 20 మోస్ట్ సిగ్నిఫికెంట్ ఐటీ రోల్స్ యూ షుడ్ కన్సిడర్ ఇన్ ఇండియా' స్టడీలోని ఇతర ప్రధాన విశేషాలు ఇలా ఉన్నాయి..
- రానున్న సంవత్సరాల్లో సోషల్ మీడియా అడ్మినిస్ట్రేటర్, మెషిన్ లర్నింగ్ డిజైనర్, ఐవోటీ డిజైనర్ తదితర కొలువులు ఎక్కుగా డిమాండ్ ఉన్న ఉద్యోగాలుగా అందుబాటులోకి రానున్నాయి.
- 2017 నాటికి భారత్లో ఐటీ రంగపు కొలువుల సంఖ్య 91 లక్షల దరిదాపుల్లో ఉంటే.. అందులో 59 లక్షల కొలువులు కొత్త తరపు టెక్నాలజీలపై ఆధారపడిన కొలువులే కావడం విశేషం.
- 2027 నాటికి ఈ విభాగంలో కొత్తగా 50 లక్షల కొలువులు అందుబాటులోకి రానున్నాయి.
- డిజిటల్ పరివర్తనల నేపథ్యంలో చాలా పరిశ్రమలు ప్రత్యేక నైపుణ్యతల అవసరం మేరకు ఏక్కడ, ఎలా ఉద్యోగులు వీటిపై పని చేస్తున్నారన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ అవసరాలకు తగ్గ కొలువుల భర్తీ అంత కష్టతరమేమీ కాకపోవచ్చు.
- కంపెనీలు తమ ఉద్యోగుల విజ్ఞానాన్ని, నైపుణ్యతను పెంపొందించేందుకు గాను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తర్ఫీదును అందిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకమైన సర్టిఫికేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
- ప్రస్తుతం ఐటీ కొలువులు నిర్వహిస్తున్న వారిలో ఐదో వంతు మంది తమ సర్టిఫికేషన్ కార్యక్రమాలను తమ సొంత నిధులతో పూర్తి చేసుకుంటున్నారు. 2017 నాటికి ఇప్పుడున్న ఐటీ నిపుణుల్లో దాదాపు 50% మంది ఆయా సర్టిఫికేషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఉన్నారు.
- సర్టిఫికేషన్ కలిగి ఉన్న ఐటీ నిపుణులపై 89% శాతం మంది నియామకపు మేనేజర్లు అత్యున్నతమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
- సర్టిఫికేషన్ పొందిన నిపుణులు అందిస్తున్న సేవల్లో నాణ్యత స్థాయి పెరిగినట్టుగా 88% శాతం మంది వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేశారు.