Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు
- నిరుత్సాహ పరిచిన ఆర్బీఐ పరపతి సమీక్ష..
- ప్రభావం చూపిన వాణిజ్య యుద్ధ భయాలు
- ఎగ్జిట్ 'పోల్స్' వేళ మదుపర్ల అప్రమత్తత
- 572 పాయింట్ల పతనమైన సెన్సెక్స్..
- భారీగా తరలిపోయిన ఎఫ్ఐఐలు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమైయ్యాయి. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) దైమాసిక పరపతి విధాన సమీక్ష మార్కెట్ వర్గాలకు ఊరటనివ్వకపోవడం.. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధ పరిణామాలు తీవ్రతరం కావడం.. పలు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఎగ్జిట్పోల్స్ వెల్లడి కానుండటంతో మదుపరులు గురువారం అప్రమత్తంగా ట్రేడింగ్ నిర్వహించారు. దీనికి తోడు రూపాయి విలువ పడిపోవడం కొన్ని రంగాల స్టాక్స్కు రుచించకపోవడం, వృద్ధి రేటు పతనపు అంచనాలు, ఎఫ్ఐఐలు భారీగా తరలిపోతున్నారంటూ వెలువడిన అంచనాలు గురువారం దలాల్ స్ట్రీట్ను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. ఆసియా మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. మార్కెట్ ఆరంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా 10,700 దిగువన ట్రేడ్ అయ్యింది. మధ్యాహ్నానికి కాస్త కోలుకున్నట్లే కన్పించినా.. చమురు ఉత్పత్తి, సరఫరాపై నేడు జరగబోయే ఓపెక్ సమావేశం, శుక్రవారం సాయంత్రం వెలువడబోయే రాష్ట్రాల ఎగ్జిట్పోల్స్ ఫలితాలపై ద ష్టి పెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ఒత్తిడికి గురైన సూచీలు మరింత పతనమయ్యాయి. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 572 పాయింట్లు నష్టపోయి 35,312 వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు దిగజారి 10,601 వద్ద స్థిరపడ్డాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 70.82గా కొనసాగింది. .బీఎస్ఈలో మిడ్క్యాప్ సూచీ 1.5 శాతం, స్మాల్క్యాప్ సూచీ 1.3 శాతం చొప్పున నష్టపోయాయి. ఒక్క పూటలోనే మదుపరి సంపద రూ.2.28 లక్షల కోట్లు ఆవిరయ్యింది.
ప్రతికూల పరిణామాలు..
అమెరికా వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై చైనాకు చెందిన హువాయి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ను (సీవోవో) కెనడాలో అరెస్ట్ చేశారు. ఈ పరిణామం మళ్లీ పలు దేశాల ఆర్ధిక వ్యవస్థల్లో వాణిజ్య యుద్ధ భయాలను పెంచింది. దీంతో ఆసియన్ మార్కెట్లలో అనిశ్చితి చోటు చేసుకుంది. హాంగ్సెంగ్, నిక్కీ, షాంఘౖెె సూచీలు 2.75 శాతం మేర విలువ కోల్పోయాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీస్ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 12న వెల్లడి కానున్నాయి. ఇంతకు ముందు ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు 2019 సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో మదుపర్లు కూడా అప్రమత్తంగా వ్యవహారించారు. ఇవి భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అదే విధంగా అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ ఓ దశలో 54 పైసలు పతనమై 71కి పడిపోయింది. తుదకు 43 పైసల క్షీణతతో 70.89 వద్ద ముగిసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతానికి పడిపోనుందని పఅంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ ఫిచ్ విశ్లేషణ కూడా రూపాయి, మార్కెట్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. 2019 ముగింపు నాటికి రూపాయి విలువ 75కు పడిపోయిన ఆశ్యర్యపోవాల్సిందేమీ లేదని ఫిచ్ పేర్కొంది. ఈ పరిణామము రూపాయి విలువను దెబ్బతీసింది.
లాభ.. నష్టాలు..
బీఎస్ఈలో అన్ని రంగాల సూచీలు నష్టాలను చవి చూశాయి. ఆటో సూచీ అత్యధికంగా 2.26 శాతం పతనమైంది. అదే విధంగా రియాల్టీ 2.26 శాతం, మైలిక వసతులు 1.73 శాతం, టెక్ 1.71 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.70 శాతం, ఐటీ 1.67 శాతం, ఎఫ్ఎంసీజీ 1.65 శాతం చొప్పున అధికంగా నస్టాపోయి మార్కెట్లను కుదుపునకు గురి చేశాయి. సెన్సెక్స్లో ఒక్క సన్ ఫార్మా మాత్రమే 1.57 శాతం లాభపడింది. మిగితా స్టాక్స్ అన్ని నష్టపోయాయి. మారుతీ సుజుకీ 4.63 శాతం, టాటా మోటార్స్ 4.02 శాతం, యెస్ బ్యాంకు 3.08 శాతం, అదానీ పోర్ట్సు 2.74 శాతం, రిలయన్స్ ఇండిస్టీస్ 2.72 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఇంతక్రితం సెషన్లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.357.82 ఈక్విటీలను విక్రయించగా, దేశీయ మదుపర్లు రూ.791.59 కోట్ల ఈక్విటీలను విక్రయించారు.