Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ) ఆస్తులను కొనుగోలు చేసేం దుకు ప్రభుత్వ రంగ బీమా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఏఐ కి చెందిన ముంబయిలోని 23 అంతస్తుల భవనాన్ని దక్కించుకోవాలని భారతీయ జీవిత బీమా (ఎల్ఐసీ) సంస్థతో పాటు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ) యోచిస్తున్నాయని సమాచారం. తమ ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు ఈ భవంతులు ఉపయోగకరంగా ఉంటాయని ఆయా సంస్థలు భావిస్తున్నట్టుగా సమాచారం.. ఎయిరిండియా బిల్డింగ్ విక్రయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ పలు ప్రభుత్వరంగ సంస్థలు మాత్రం ఆసక్తి చూపుతున్నాయని కంపెనీ వర్గాల వెల్లడించాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి జనవరి 2018 నాటికి ఈ భవంతిని అద్దెకు ఇవ్వడంతో సంస్థకు రూ.291 కోట్లకుపైగా నిధులు సమకూరాయి.