Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అమ్మకం జరిగే సమయానికి సదరు స్థిరాస్తి 'నిబంధనల ప్రకారం నిర్మాణం జరిగింది' అని ధ్రువీకరణ పత్రం (కంప్లీషన్ సర్టిఫికెట్) కలిగి ఉంటే కొనుగోలుదారులు ఆ ఫ్లాట్కు వస్తుసేవల పన్నును (జీఎస్టీ) చెల్లించాల్సిన అసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ శనివారం ప్రకటించింది. నిర్మాణంలో ఉన్న స్థిరాస్తిని గానీ, నిర్మాణం పూర్తైనా కంప్లీషన్ సర్టిఫికెట్ లేని స్థిరాస్తిని గానీ కొనుగోలు చేస్తే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని అధికా రికంగా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కొనుగోలుదారుల దృష్టికి తీసుకుపోయి వారికి తగిన లబ్ధి కలిగేలా చర్యలు తీసుకోవాలని స్థిరాస్తి వ్యాపారులకు ఆర్థిక శాఖ సూచనలు చేసింది. జీఎస్టీ మినహాయింపు మేరకు ధరలు తగ్గించాలని తెలిపింది.జేఎన్యూఆర్ఎం, రాజీవ్ ఆవాస్ యోజన, ప్రధా న్ మంత్రి ఆవాస్ యోజన, ఇతర రాష్ట్ర ప్రభుత్వ గృహని ర్మాణ పథకాలపై 8 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. దీనిని నిర్మాణదారులు ఇన్పుట్ ట్యా క్స్ క్రెడిట్తో సవరించు కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇలా సవరించు కొంటే చాలా చోట్ల గృహనిర్మాణదారులు నగదు రూపంలో మళ్లీ అదనంగా జీఎస్టీని చెల్లించాల్సిన అవసరం ఉండదు. వారి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు చెల్లించాల్సిన జీఎస్టీకి సరిపో తుం దని ఆర్థిక శాఖ పేర్కొంది. దీంతో సొంత ఇంటిని కొనుగోలు దారులకు కాస్త ఉరట కలుగనుంది.
జీఎస్టీ రిటర్నుల దాఖలు గడువు పెంపు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వార్షిక పన్ను రిటర్నుల చెల్లింపు గడువను ప్రభుత్వం పెంచింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీ వార్షిక రిటర్నులు దాఖలు చేసేందుకు డిసెంబరు 31 వరకు తొలుత ఆర్ధిక మంత్రిత్వ శాఖ గడువు విధించింది. దీన్ని పొడగించాలని వ్యాపార, వాణిజ్య సంస్థల కోరిక మేరకు రిటర్నుల గడువును మూడు నెలల పాటు పెంచినట్లు శనివారం ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. దీంతో రిటర్న్లకు గడు వు 2019 మార్చి 31 వరకు పొడగించినట్టయ్యింది. జీఎస్ టీఆర్-9, జీఎస్టీఆర్్-9ఎ, జీఎస్టీఆర్ -9సీ దాఖలుకు గడువు తేదీని మార్చి 31 వరకు పొడగించాలని నిర్ణయిం చామని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐటీసీ) వెల్లడించింది. త్వరలోనే అందుకు సంబంధించిన పత్రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. రిటర్నుల దాఖలునకు వెబ్సైట్లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని, రిటర్నులు దాఖలు చేసే ఫార్మాట్ కూడా జీఎస్టీ వెబ్సైట్లో లేదని వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్రం రిటర్న్ల గడువు పెంచినట్టుగా తెలుస్తోంది.